వారణాసి పోటీలో విశాఖ యువకుడు
అమరావతి,మే3(జనంసాక్షి): దేశ ప్రధాని నరేంద్రమోడీపై పోటీ చేస్తున్న వారణాసి నుంచి ఎపికి చెందిన ఓ యువకుడు బరిలో దిగాడు. శాఖ నగరంలోని విశాలాక్షి నగర్కు చెందిన మానవ్ ఇండిపెండెంట్గా అభ్యర్థిగా బరిలోకి ఉన్నాడు. గత నెలలో ఆంధప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోను పోటీ చేసిన మానవ్ విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా నిలబడ్డాడు. రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతోంది. దీంతో మోడీపై పోటీ చేసే వారి సంఖ్య అధికం అవుతుంది. యుపిలోని వారణాసి నుంచి మోడీ బరిలో ఉన్నారు. రైతులపై మోడీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ తెలంగాణలోని నిజామాబాద్కు చెందిన 40 మంది రైతులు వారణాసిలో నామినేషన్ వేయడానికి వెళ్లారు. చివరికి ఎలాగోలా 25 మంది రైతులు నామినేషన్ వేసినా 24 మంది నామినేషన్ను అధికారులు తిరస్కరించారు. దీంతో ఒకే ఒక్క రైతు బరిలో మిగిలాడు. తాజాగా విశాఖపట్టణానికి చెందిన ఓ యువకుడు కూడా మోడీపై పోటీకి దిగాడు.