వాహనాల తనిఖీలలో 2 లక్షల 38 వేలు స్వాధీనం.

కరన్ కోట్ ఎస్సై మధుసూదన్ రెడ్డి.
తాండూరు అక్టోబర్ 13 (జనం సాక్షి) ఎన్నికల కోడ్ సందర్భంగా పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీలలో రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయల స్వాధీనం చేసుకున్నట్లు కరణ్ కోట్ ఎస్సై మధుసూదన్ రెడ్డి తెలిపారు.శుక్రవారం తాండూరు మండలం
కొత్లాపూర్ చెక్ పోస్ట్ దగ్గర వాహనాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీలో మిట్ట బాస్ పల్లి గ్రామానికి చెందిన రాథోడ్ శంకర్ నాయక్ తన బైక్ నెంబర్ టిఎస్07 ఎఫ్ ఎక్స్ 6643 వాహనంపైవెళుతున్న సమయంలో చెక్పోస్ట్ దగ్గర పోలీసులు తనిఖీలు నిర్వహించారు.తనిఖీలలో రూ.2,38,000 పట్టుబడినట్లు ఎస్సై తెలిపారు. తనిఖీల్లో పట్టుబడ్డ నగదును సీజ్ చేయడం జరిగిందని వీటి ని స్క్రీనింగ్ కమిటీ ముందు ప్రొడ్యూస్ చేసి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్సై మధుసూదన్ రెడ్డి తెలిపారు.