వాహనాల తనిఖీలో అపశృతి

బైకు ఢీకొని ఎస్‌ఐ మృతి

భువనేశ్వర్‌,నవంబర్‌19(జనం సాక్షి): వాహన తనిఖీలు చేస్తుంటే బైకు ఢీకొట్టిన ఘటనలో ఎస్‌ఐ ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన ఒడిశాలోని బరిపడా పీఎస్‌ పరిధిలో జరిగింది. లా కాలేజీ ఎదుట ఎస్‌ఐ దయానిధి దాస్‌ వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా..రెండు బైకులపై వస్తోన్న యువకులను ఆపాలని సూచించాడు. అయితే ఓ బైకుపై ఉన్న వ్యక్తి తనిఖీల నుంచి తప్పించుకునే క్రమంలో ఎస్‌ఐ దయానిధి దాస్‌ను ఢీకొట్టాడు. తీవ్రగాయాలతో ఉన్న ఎస్‌ఐ దయానిధిని పండిత్‌ రఘునాథ్‌ ముర్ము మెడికల్‌ కాలేజీకి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ప్రమాదానికి కారణమైన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన దయానిధి దాస్‌ కు ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు ఘనంగా నివాళులర్పించారు.