వాహనాల తనిఖీల్లో పట్టుబడిన నగదు

సిఐ రామ్ లాల్

మక్తల్ అక్టోబర్ 13 (జనంసాక్షి)

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున మక్తల్ సిఐ రామ్ లాల్, యస్ ఐ పర్వతాలు, పోలీసు సిబ్బందితో మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాచ్వార్ టోల్ గేట్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా రైచూర్ నుండి మహబూబ్ నగర్ వెళ్తున్న బోలరా కారును అపి తనిఖీ చేయగా అందులో 1,09,000/- రూపాయలు ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల గ్రామానికి చెందిన కన్మనూర్ నాగన్న అనే
వ్యక్తి వద్ద ఆ డబ్బులకు ఎలాంటి రషీద్, తగిన పత్రాలు లేనందున ఆ డబ్బులను సిజ్ చేసి జిల్లా ఎలక్షన్ ట్రెజరీకి పంపించడం జరుగుతుందని సిఐ రామ్ లాల్ తెలిపారు.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎవరైనా 50 వేల కంటే ఎక్కువ డబ్బులు తీసుకువెళ్ళాలంటే వాటికి సంబంధించిన రసీదు, తగిన పత్రాలు ఉండాలని లేని యెడల వాటిని సీజ్ చేయడం జరుగుతుందని సిఐ తెలిపారు.