విజయనగరం జిల్లాలో విషాదం చోటు

 

 

 

 

 

అమరావతి: విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని కురుపాం వసతి గృహంలో నిన్న ముగ్గురు విద్యార్థులు పాముకాటుకు గురయ్యారు. వీరిని హుటాహుటిన నగరంలోని తిరుమల ఆస్పత్రిలో చేర్పించారు. వీరిలో చికిత్సపొందుతూ మంతిని రంజిత్‌ అనే విద్యార్థి రాత్రి మృతి చెందాడు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

విషయం తెలుసుకున్న జాయింట్‌ కలెక్టర్‌ మహేశ్‌కుమార్‌ హాస్టల్‌ను సందర్శించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న వారిని పరామర్శించారు. చికిత్సపొందుతున్న విద్యార్థులకు మెరుగైన చికిత్సలు అందించాలని అక్కడి వైద్యులను ఆదేశించారు. ఇద్దరు విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని జేసీ వెల్లడించారు.