విజయవంతంగా పృథ్వీ-2
దేశీయంగా రూపొందించిన అణ్వాయుధ సామర్థ్యం గల పృథ్వీ-2 క్షిపణి ప్రయోగం విజయవంతం అయ్యింది. ఒడిశాలోని చాందీపూర్లో డీఆర్డీవో రెండు సార్లు దీన్ని ప్రయోగించింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి దీనిని ప్రయోగిస్తారు. 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఈ క్షిపణి చేధించగలదు. వెయ్యి కిలోల వార్హెడ్స్ను మోసుకెళ్లే సామర్థ్యం దీని సొంతం.