విజయ్‌ మాల్యా కార్లు వేలం

32 లక్షల విలువ చేసే మాల్యా కార్లు 1.40 లక్షలకే వేలం

 

కింగ్‌ఫిషర్‌ యజమాని  విజయ్‌ మాల్యాకు చెందిన రెండు కార్లను ఆన్‌లైన్‌ లో వేలం వేశారు. ఈ రెండు కార్లను హుబ్బళ్లికి చెందిన పారిశ్రామికవేత్త  హనుమంతరెడ్డి ఆన్‌లైన్‌ వేలంలో దక్కించుకున్నారు. రూ.32 లక్షల విలువ చేసే మాల్యా కార్లు హనుమంతరెడ్డికి కేవలం రూ.1.40 లక్షలకే లభించాయి. విజయ్‌ మాల్యా ఉపయోగించిన లగ్జరీ కార్లు, భవంతులు, ఆస్తులు వేలం వేసే పరిస్థితి వచ్చిన విషయం తెలిసిందే. ఇలా రెండు కార్లు ముంబైలో వేలం వేయగా ఆన్‌లైన్‌ వేలం ద్వారా వాటిని హనుమంతరెడ్డి ఎంహెచ్‌01 డిఎ7227 నెంబరు గల సొనాటో గోల్డ్‌, హోండా ఎకాట్రా ఎంహెచ్‌01 ఎంఎ 1235 కార్లను కొనుగోలు చేశారు.