విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ

బిజినపల్లి : నవంబర్ .2. జనం సాక్షి .మండలంలోని లింగా సాయిన్ పల్లి  ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు బుధవారం ఏకరూప దుస్తులను పంపిణీ చేసినట్లు ప్రధానోపాధ్యాయులు నిరంజన్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వము పేద విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించేందుకు ఉచితంగా దుస్తులను పాఠ్యపుస్తకాలను మధ్యాహ్న భోజనం అందించి ప్రోత్సహిస్తున్నట్లు హెచ్ ఎం పేర్కొన్నారు దుస్తుల పంపిణీలో గ్రామ సర్పంచ్ సుగుణమ్మ ఎంపీటీసీ సభ్యురాలు సోములమ్మ ఉప సర్పంచ్ నాగేందర్ సి తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు