విద్యుత్‌ షాక్‌తో న్యాయమూర్తి మృతి

కర్నూలు,ఆగస్ట్‌20(జనం సాక్షి): ఆదోని మండలం విరుపాపురం గ్రామానికి చెందిన న్యాయమూర్తి దేవదాసు (43) విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందారు. పత్తికొండ సెకండ్‌ క్లాస్‌ మేజిస్టేట్ర్‌ గా విధులు నిర్వహిస్తున్న దేవదాసు.. నూతన గృహ నిర్మాణం జరుపుతున్నారు. దీనిలో భాగంగా  క్యూరింగ్‌ చేసేందుకుగాను నీళ్ల కోసం మోటార్‌ స్విచ్‌ ఆన్‌ చేస్తుండగా విద్యుత్‌ వైరు ఆయనకు తగిలింది. దీంతో దేవదాసు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.