విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను పేల్చివేసిన మావోయిస్టులు

బీహార్‌, జనంసాక్షి: రాష్ట్రంలోని జామూయ్‌ జిల్లా బదిగ్రామ్‌లోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను మావోయిస్టులు పేల్చివేశారు. సుమారు వంద మందికి పైగా మావోయిస్టులు ఈ ఘటనలో పాల్గొన్నారని డిప్యూటీ ఎస్పీ వీరేంద్ర సాహూ తెలిపారు. ఈ సంఘటనలో సబ్‌స్టేషన్‌లోని వస్తువులు పూర్తిగా కాలిపోయాయని చెప్పారు.