విద్యుత్‌ స్తంభాన్ని ఢీ కొన్న కారు…మహిళ మృతి

చిత్తూరు: తమిళనాడులోని తిరుపత్తూరు నుంచి తిరుమల శ్రీవారి దర్శనార్థం 9మంది యాత్రిక బృందంతో బయలుదేరిన కారు బుధవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది. భక్తులు ప్రయాణిస్తున్న తవేరా కారు చిత్తూరు జిల్లా చంద్రగిరి శివారులోని రోడ్డు పక్కన ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో తేన్‌మోళి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనంలో రూయా అస్పత్రికి తరలించారు.