విద్యుదాఘాతానికి గురైన మహిళ మృతి

వంగూరు: మండలంలోని చారకొండ గ్రామంలో ఏలే పద్మ (40) అనే మహిళ శనివారం ఉదయం విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. పంపు మోటారుకు ప్లగ్‌ పెడుతుండగా విద్యుత్తు తీగ తగిలి అక్కడికక్కడే మరణించింది. ఆమెకు భర్త, పాప, బాబు ఉన్నారు.