వివాహితపై అత్యాచారం ,హత్య

ముంబయి : తన కోరిక తీర్చలేదనే కోపంతో స్నేహితుడి భార్యనే కత్తితో పొడిచి చంపిన దారుణ ఘటన ముంబయి నగరంలో వెలుగుచూసింది. పాల్ఘార్ కు చెందిన 23ఏళ్ల హితేష్ కార్తక్ పాండీ ఉద్యోగ వేటలో దక్షిణ ముంబయిలోని కొలబా ప్రాంతానికి వచ్చి అక్కడి ఓ అపార్టుమెంటులో అద్దెకు దిగాడు. అదే అపార్టుమెంటులో శ్వేతాటాండేల్ అనే 28 వివాహిత తన భర్త మహేంద్రతో మొదటిఅంతస్తులో నివాసముంటోంది. మహేంద్ర సోదరుడు హితేష్ కార్తక్ పాండీ గదిలో కలిసి నివాసముంటుండటంతో అతనికి వీరి కుటుంబంతో పరిచయం ఏర్పడింది. దీంతో హితేష్ మహేంద్ర ఇంట్లోనే పెయిడ్ గెస్టుగా భోజనం చేస్తుండేవాడు. ఈ నెల పదో తేదీన మహేంద్ర తన సోదరుడితో కలిసి పనిమీద బయటకు వెళ్లాడు. దీంతో హితేష్ టిఫిన్ చేసేందుకు మహేంద్ర ఇంటికి వచ్చి శ్వేతా ఒంటరిగా ఉండటం చూసి తన కోరిక తీర్చమని బలవంతం చేశాడు. దాన్ని తిరస్కరించిన శ్వేతా హితేష్ తో పెనుగులాడుతూ అరిచేందుకు ప్రయత్నించింది. అంతే తన బండారం బయటపడుతుందని హితేష్ వంటగదిలోని కత్తి తీసుకొని
శ్వేత గొంతు కోసి చంపాడు. అనంతరం తన గదికి వెళ్లి స్నానం చేసి ఏమీ తెలియనట్లు పనిపై బయటకు వెళ్లాడు. బయటకు వెళ్లి వచ్చిన మహేంద్ర  రక్తపు మడుగులో శ్వేత పడి ఉండటం చూసి ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు చెప్పారు. వివాహితపై అత్యాచారానికి ప్రయత్నించడంతోపాటు ఆమెను చంపిన కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడై హితేష్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు.