వివేకా హత్య కేసులో దోషులను కాపాడే యత్నం

సిఎం జగన్‌ ఎందుకు స్పందించరు: సోమిరెడ్డి
నెల్లూరు,మార్చి2(జనం సాక్షి): వివేకా తనయ వాంజ్ఞూలంతో హంతకులు ఎవరో తేలిపోయిందని, అయినా ప్రబుత్వం వారిని కాపాడేందుకు నానా తంటాలు పడుతోందని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి తెలిపారు. సొంత బాబాయ్‌ హత్యజరిగితే జగన్‌ ఇంత నింపాదిగా ఉండడడం కూడా ప్రజల్లో అనుమానా లకు దారితీస్తోందని అన్నారు. వైఎస్‌ వివేకా హత్య జరిగినప్పుడు పార్టీలకు అతీతంగా బాధపడ్డామని సోమిరెడ్డి తెలిపారు. వివేకా హత్య కేసు మసిపూసి మారెడుకాయ చేయాలనుకున్నారని విమర్శించారు.
నిజం ఎప్పుడు దాగదని.. సీఎం కార్యాలయంలోనే వివేకా హంతకులు ఉండటం దారుణమన్నారు. ఒక ఎంపీ తనను హత్య చేసేందుకు కుట్రలు చేస్తున్నారు అంటే అర్థం చేసుకోవాలని సోమిరెడ్డి పేర్కొన్నారు. సునీత ఇచ్చిన వాంగ్మూలంతో వివేకా హత్య కారకులు ఎవరో తెలిసిపోతుం దన్నారు. జనాల ప్రాణాలు తీసేవారిని కాపాడేందుకే సీఎం ఉన్నారా? అని ప్రశ్నించారు. సీఎం మౌనంగా ఉన్నారంటే, మౌనం అర్దాంగీకరమేనన్నారు. వివేకా హత్యతో జగన్మోహన్‌ రెడ్డి, ఆయన బంధువుల పాపాలు పండాయన్నారు. వైఎస్‌ వివేకా హత్యకి కారకులైన వాళ్ళు రెండు కళ్లు అని చెప్పుకొనే వాళ్లు ఈ పాలకులని సోమిరెడ్డి పేర్కొన్నారు.