విశాఖలో దారుణ ఘటనలు

భర్త చేతిలో దారణ హత్యకు గురైన భార్య
భార్యా బిడ్డలను రైల్వే స్టేషన్లో వదిలి వెళల్లిన శాడిస్ట్‌
విశాఖపట్నం,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): విశాఖ జిల్లాలో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకడు భార్యను చంపితే..మరొకడు భార్యాబిడ్డలను వదిలేశాడు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం 66వ వార్డు కొత్తపాలెం సవిూపంలోని నాగేంద్రకాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అనుమానంతో ఓ శాడిస్ట్‌ భర్త తన భార్య ఎద్దు శారదపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో భార్య ప్రాణాలు కోల్పోయింది. గోపాలపట్నం పీఎస్‌లో నిందితుడు లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. విశాఖలోనే మరో అమానుష ఘటన చోటుచేసుకుంది. భార్య, కుమార్తెను విశాఖ రైల్వేస్టేషన్లో అనాథలుగా వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో భర్త ఇంటికి వెళ్లగా.. అత్త ఇంటికి తాళం వేసి లోనికి రాకుండా అడ్డుకుంది. అక్కడినే బాధితురాలు ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంటుంది. అదనపు కట్నం తేవాలంటూ వేధిస్తున్నారని బాధితురాలు ఆరోపించింది. ఈ ఘటనలు స్థానికులను కలచి వేస్తున్నాయి.