విశాఖ బస్టాండ్‌ వద్ద అగ్ని ప్రమాదం

విశాఖ, జనంసాక్షి నగరంలోని ద్వారకానగర్‌ ప్రధాన ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఉన్న ఓ దుకాణ సముదాయంలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు కాంప్లెక్స్‌లోని ఓ దుకాణంలో మంటలు చెలరేగి మిగతా దుకాణాలకు వ్యాపించాయి. ఈ సముదాయంలో మొత్తం నాలుగు అంతస్తులు ఉన్నాయి. దట్టమైన పొగలు కమ్ము కోవడంతో మూడు, నాలుగో అంతస్తుల్లో పలువురు చిక్కుకున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది భారీ ్నకేన్ల సహాయంయతో దుకాణ సముదాయంలో చిక్కుకున్న వారిని రక్షిస్తున్నారు.