విశాఖ-షిర్డీ ప్రత్యేక రైల్లో దొంగల బీభత్సం

ఔరంగాబాద్‌: విశాఖ-షిర్డీ మధ్య నడిచే ప్రత్యేక రైల్లో దొంగలు బీభత్సం సృష్టించారు. మహారాష్ట్ర ఔరంగాబాద్‌ వద్ద ఈరోజు ఉదయం రైలులో దోపిడికి పాల్పడ్డారు. ప్రయాణికులను మారణాయుధాలతో బెదిరించి నగదు, బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్లు దోచుకు వెళ్లారు. ఈ ఘటనపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూన్నారు.
ఫిర్యాదు చేసేందుకు కూడా పోలీసులు అందుబాటులో లేరని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా షిర్డీ భక్తులను దొంగలు టార్గెట్‌ చేసి దోపిడీకి పాల్పడుతున్న విషయం తెలిసిందే. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు మాత్రం ఎటువంటి చర్యలు చేపట్టలేదు….