విశ్వకర్మ ల పై అక్రమ కేసులు ఎత్తివేయాలి

జనగామ (జనం సాక్షి)జూలై4:తెలంగాణా ప్రభుత్వంలో చారిలకు అవమానం జరుగుతుందని మా జీవన విధానాన్ని కించపరుస్తూ మమ్మల్ని కేటీఆర్ చారి పప్పు చారి వాడు ఒక గొట్టం గాడు అని విమర్శించినందుకు శాంతియుతంగా ర్యాలీ తీసుకున్న సందర్భంగా ఎలాంటి అవాంతరాలు జరగకున్న  130 మంది విశ్వకర్మల మీద కేటీఆర్ కెసిఆర్ అక్రమంగా కేసులు పెట్టించినారు. ఈ అక్రమ కేసులు పెట్టినందుకు  నల్లబ్యాడ్జిలు ధరించి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో   జనగామ పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షులు ఆకోజు ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి రతన్, కోశాధికారి రత్నం, ఉపాధ్యక్షులు ఆనందాచారి, సహాయ కార్యదర్శి హరీష్, సభ్యులు చెన్నోజు ఆంజనేయులు,నారోజు గోపి ,పానుగంటి వెంకటరమణ, వలబోజు చక్రపాణి,చెన్నోజు నగేష్     జనగామ పట్టణ స్వర్ణకార సంఘం  సభ్యులు పాల్గొన్నారు.