వీఆర్ఏలను ముందస్తు అరెస్ట్

మల్దకల్ సెప్టెంబర్ 11(జనం సాక్షి)జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం వీఆర్ఏల అధ్యక్షులు ,ఉపాధ్యక్షులు, కార్యదర్శులను తదితరులు వీఆర్ఏలను ఆదివారం మల్దకల్ పోలీస్ స్టేషన్ కు ముందస్తు అరెస్టు చేశారు. నిన్న మరణించిన వెంకటేశ్వర్లు అంత్యక్రియలకు వీఆర్ఏలు అధిక సంఖ్యలో పాల్గొంటారని ముందస్తు అరెస్టు చేయడం జరిగింది. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం రామసాంపల్లి వీఆర్ఏ మన్నే వెంకటయ్య గుండెపోటుతో మృతి చెందడంతో అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో వెళుతున్నారని సమాచారం తెలుసుకున్న పోలీసులు ముందు అరెస్ట్ చేశారు. వీఆర్ఏలు పోలీస్ స్టేషన్ లోని రెండు నిమిషాలు మౌనం పాటించారు.
Attachments area