వీరులారా.. వందనం!

5

– గన్‌పార్కువద్ద తెరాస సభ్యుల నివాళి

గన్‌పార్క్‌ వద్ద టిఆర్‌ఎస్‌ నేతల నివాళి

హైదరాబాద్‌,మార్చి10(జనంసాక్షి): బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్బంగా గురువారం ఉదయం మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎదుట ఉన్న గన్‌పార్క్‌ వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. మంత్రులు హరీష్‌రావు, కడియం శ్రీహరితోపాటు పలువురు అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ అమరవీరులకు జోహర్‌ అంటూ నినాదలతో నివాళులర్పించారు. సమావేవౄలకు హాజరయ్యేముందు వీరు అసెంబ్లీ ముందు సమావేవమైనివాళి అర్పించారు. తెలంగాణ ప్రజలంతా టీఆర్‌ఎస్‌ వైపే ఉన్నారని ఈ సందర్భంగా ¬ంశాఖ మంత్రి నాయిని నర్సింహరెడ్డి అన్నారు.  వచ్చే రెండు మూడేళ్లలో తెలంగాణను సస్యశ్యామలం చేస్తామన్నారు. రూ.33 వేల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈ బడ్జెట్‌లో చరిత్రాత్మకమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నామని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హావిూలన్ని నెరవేరుస్తామన్నారు. సీఎం కేసీఆర్‌ పాలనను ప్రజలు హర్షిస్తున్నారని పేర్కొన్నారు.