వీర అమర జవాన్లకు ప్రధాని నివాళి

y3yc3jko1965 నాటి భారత్-పాకిస్థాన్ యుద్ధంలో అసువులు బాసిన వీర జవాన్లను జాతి యావత్తూ ఘనంగా స్మరించుకుంది. ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీలోని అమర జవాన్ జ్యోతి వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో త్రివిధ దళాధిపతులతోపాటు పలువురు సైనికాధికారులు పాల్గొన్నారు. అటు యుద్ధంలో భారత్ విజయం సాధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సైన్యం నాలుగు రోజులపాటు గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించింది.