వృద్ధులు వితంతువులు వికలాంగులకు వర ప్రదాత సీఎం కేసీఆర్

– ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి మరియు డిసిసిబి చైర్మన్ మనోహర్ రెడ్డి
చౌడాపూర్,సెప్టెంబర్ 2(జనం సాక్షి): వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్ర పరిధిలోని మండల తహసిల్దార్ ఆవరణలో నూతన ఆసరా పెన్షన్ కార్డులను ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి చౌడాపూర్ మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలకు అందించడం జరిగింది.అదేవిధంగా సీఎం కేసీఆర్ వృద్ధులకు, వితంతువులకు,వికలాంగులకు వరప్రదాతా అన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి తో పాటు డిసిసిబి చైర్మన్ మనోహర్ రెడ్డి మరియు ఎంపీపీ సత్యమ్మ హరిచందర్,జడ్పిటిసి రాందాస్ నాయక్,గ్రామ సర్పంచ్ కొత్త రంగారెడ్డి,తెరాస మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి,స్థానిక ఎంపిటిసి శంకర్,డిప్యూటీ సర్పంచ్ శివకుమార్,తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర కార్యదర్శి వెంకట్ మరియు వివిధ గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు,వార్డు మెంబర్లు,టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది.