వృద్ధ దంపతుల ఇంటికి కరెంటు మీటర్ అందించిన దాత… తేలు అంజయ్య

వృద్ధ దంపతుల ఇంటికి కరెంటు మీటర్ అందించిన దాత… తేలు అంజయ్య

బచ్చన్నపేట( జనం సాక్షి ) అక్టోబర్ 14
బచ్చన్నపేట మండల కేంద్రం ఇందిరానగర్ కాలనీకి చెందిన వృద్ధ దంపతులు. గంధం లచ్చవ్వ లక్ష్మయ్య కొద్ది రోజుల క్రితం కొందరి సహకారంతో కొత్తగా రూమ్ నిర్మించుకున్నారు కానీ అందులో కరెంటు లేకపోవడంతో వారు చీకట్లో ఉండడం చూసి విషయం కాలనీవాసు ద్వారా తెలుసుకున్న బసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తేలు అంజయ్య మనసు చెల్లించి ఆ కుటుంబానికి కరెంటు మీటరు ఇంటి లోపల అమర్చి శనివారం స్థానిక సర్పంచి వడ్డేపల్లి మల్లారెడ్డి. నర్ర మహేందర్ రెడ్డి. వార్డు మెంబర్. జంధ్యాల ఉపేందర్. కిసిడిపల్లి ఎంపీటీసీ కరణాల వేణుగోపాల్. జంగిడి సిద్ధులు. ఎండి కేసర్. ఉప్పలోది నరసింహ చారి తో కలిసి లైట్లు వెలిగించారు. సర్పంచి తో సహా కాలనీవాసులు మంచి మనసున్న తేలు అంజయ్యను అభినందించారు