వెంకన్న సేవలో గవర్నర్‌,డీఎస్‌, కోట్ల

తిరుపతి : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడిని సోమవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు తెల్లవారుజామున గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు, ఎమ్మెల్సీ డి. శ్రీనివాస్‌, కేంద్రమంత్రి కోట్ల ప్రకాష్‌ రెడ్డి తరితరులు స్వామివారిని దర్శించారు. అనంతరం వారికి టీటీడీ అధికారులు స్వామివారి ప్రసాదాలు అందచేశారు.