వైఎస్‌ కుటుంబం కాంగ్రెస్‌పై బురద చల్లడం మానుకోవాలి: మంత్రి ఆనం

విజయవాడ: వైఎస్‌ కుటుంబం కాంగ్రెస్‌పై బురద చల్లడం మానుకోవాలని మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి చేశారు. వైఎస్‌ హయాంలో రైతులకు ఇవ్వాల్సిన ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ.500 కోట్ల బకాయిలు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం చెల్లించిందని ఆయన తెలిపారు. వైఎస్‌ చెప్పినట్లే వివాదాస్పద జీవోలపై అప్పటి మంత్రులు సంతకాలు చేశారని ఆయన తెలిపారు.