వైఎస్‌ కుటుంబం వెంటే ఉంటాం: కొండా సురేఖ

హైదరాబాద్‌, జనంసాక్షి: వైఎస్‌ కుటుంబం నుంచి విడిపోయే ప్రసక్తిలేదని కొండా సురేఖ చెప్పారు. కొండా మురళీ, సురేఖ దంపతులు జైలులో జగన్‌ను కలిపిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. తాము ఆ కుటుంబం వెంటే ఉంటామని చెప్పారు. పార్టీపై తనకు అసంతృప్తిలేదని చెప్పారు. పార్టీ మారడంలేదన్నారు. తాము పార్టీ మారుతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం అన్నారు.