వైఎస్ హయాంలోనే ఎక్కువ ప్రాజెక్టులు పూర్తి
ప్రత్యేక¬దాతోనే ఎపికి మనుగడ: ఎంపి అవినాశ్
అమరావతి,జూన్7(జనంసాక్షి): ప్రత్యేక¬దాపై కేంద్రంతో పోరాటం చేస్తున్నది కేవలం వైకాపా మాత్రమేనని, గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దీనిని తక్కువ చేసి మాట్లాడటం వల్లనే ప్రజలు తిరస్కరించారని కడప ఎంపీ అవినాశ్ రెడ్డి పేర్కొన్నారు. విభజన చట్టంతో పోలవరం ప్రాజెక్టును చేర్చి, కేంద్ర ప్రభుత్వమే ప్రాజెక్టు నిర్మాణ పూర్తి బాధ్యతలు చేపట్టాలని విభజన చట్టంలోనే ఉందన్నారు.దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి దాదాపు రూ. 5వేల 500కోట్ల రూపాయల ప్రాజెక్టు పనులు చేపట్టారన్నారు. రూ.16వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టు నిర్మాణ అంచనాలను రూ.43 వేల కోట్లకు పెంచుకొని ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జల యజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చి తన అనుయాయులకు ప్రజాధనాన్ని దోచి పెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు వైఎస్ హయాంలో దాదాపు 80 నుంచి 90 శాతం పూర్తయిన విషయం చంద్రబాబు మరచిపోయారని ఎద్దేవా చేశారు. దివంగత సీఎం వైఎస్ఆర్ హయాంలో ప్రారంభమైన ప్రాజెక్టులు పూర్తి కావాలంటే ఒక్క జగన్తోనే సాధ్యమన్నారు. 2009లో వైఎస్ఆర్ మరణానంతరం జిల్లాలోని ప్రాజెక్టుల పనులు ఆగిపోయాయన్నారు. 2009నుంచి 2017 వరకు ప్రాజెక్టులకు కేవలం ముష్టిగా నిధులు కేటాయించడంతో అవి నేటికి పూర్తి దశకు చేరుకోలేదన్నారు. పులివెందుల ప్రాంతంలోని పైడిపాలెం ప్రాజెక్ట్కు 6 టీఎంసీలు, సీబీఆర్కు 8 టీఎంసీల నీరు వస్తే.. 1.40లక్షల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే సాగులోకి వస్తుందన్నారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా బిందు, తుంపర సేద్య పరికరాలు రైతులకు ఉచితంగా అందిస్తే మరో 60వేల ఎకరాలకు సాగు నీరు ఇవ్వవచ్చునన్నారు. దివంగత వైఎస్ఆర్ మోడల్ ప్రాజెక్ట్గా రూపొందించ డానికి మొదటి విడతలో 25వేల ఎకరాలకు సంబంధించి పనులు పూర్తి చేశారన్నారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్ పూర్తయితే సాగు, తాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. ఆ దిశగా ప్రతి కార్యకర్త 2019లో జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చే విధంగా ఇప్పటినుంచే కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక¬దా సాధించేంతవరకు వైఎస్సార్ కాంగ్రెస్ పోరాటం సాగిస్తూనే ఉంటుందన్నారు. చంద్రబాబు అమలు చేసిన పథకాలు అధికార పార్టీవారికే చేరాయని అన్నారు. ఎన్నికల హావిూల్లో ఏ ఒక్కటీ పూర్తిగా అమలు చేయలేదన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ప్రత్యేక ¬దా ద్వారా మాత్రమే సాధ్యమని అన్నారు.