వైయస్సార్ టిపి జిల్లా యువజన అధ్యక్షునిగా శ్రీకాంత్ నాయక్

టేకులపల్లి, అక్టోబర్ 13( జనం సాక్షి ): టేకులపల్లి మండలానికి చెందిన బానోత్ శ్రీకాంత్ నాయక్ ను వైయస్ఆర్టిపి యువజన విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులుగా నియమించినట్లు వైఎస్ఆర్టిపి ఇల్లందు నియోజకవర్గ ఇన్చార్జి బానోతు సుజాత విలేకరులకు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వైఎస్ఆర్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఆదేశాల మేరకు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షురాలు ఇందుజా రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా బానోత్ శ్రీకాంత్ నాయక్ మాట్లాడుతూ తనకి ఈ అవకాశం ఇచ్చినందుకు షర్మిలకు, హిందూజా రెడ్డి, బానోతు సుజాతలకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచిన ఈ బాధ్యతను పార్టీ బలోపేతానికి జిల్లాలో కృషి చేస్తానని, త్వరలో జిల్లా కమిటీ తో పాటు, మండల కమిటీలను ఏర్పాటుచేసి రాబోయే ఎన్నికల కోసం విస్తృతంగా వైఎస్ఆర్ టిపి తరఫున ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తామని ఆయన అన్నారు.