వ్యాపమ్ స్కామ్…కానిస్టేబుల్ మృతి
భూపాల్: మధ్యప్రదేశ్లో మరణ మృదంగం మోగుతూనే ఉంది. వ్యాపమ్ స్కామ్లో వరుస మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్నటి మహిళ ఎస్ఐ చనిపోయిన ఘటన మరువక ముందే…తాజాగా మరో మరణం జరిగింది. మధ్యప్రదేశ్లోని తికమ్ఘర్లో కానిస్టేబుల్ రమాకాంత్ పాండే అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అతని నివాసంలోనే మృతదేహం లభ్యమైంది. కొన్నిరోజుల క్రితం వ్యాపం స్కాంలో భాగంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు …కానిస్టేబుల్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. వ్యాపమ్ స్కామ్లో వరుసగా నాలుగు రోజుల్లో నలుగురు చనిపోయారు.