శంభునిపేటలో బిజెపి కార్యాలయం ప్రారంభం

వరంగల్ ఈస్ట్, నవంబర్ 24 (జనం సాక్షి)

వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని శంభునిపేట ప్రధాన సెంటర్లో 41, 42 డివిజన్ల బిజెపి ఎన్నికల కార్యాలయాన్ని డివిజన్ బాధ్యులు మోహనా చారి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు యోగానంద్, బైరి మురళీకృష్ణ, రవీందర్, గండ్రాతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావును వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. డబల్ ఇంజన్ సర్కార్ వస్తేనే తెలంగాణ అన్ని విధాలుగా బాగుపడుతుందని అన్నారు