శశికళ టీమ్ లో అలజడి: తమిళనాట మళ్లీ ఐటీ దాడులు

చెన్నై: తమిళనాడులో మరోసారి ఐటీదాడులు కలకలం రేపాయి. పన్ను ఎగవేత వ్యవహారంలో మంగళవారం మరో 33 చోట్ల ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. చెన్నైలోని 21 ప్రాంతాలు, చెన్నై వెలుపల మరో 12 చోట్ల ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. స్పెక్ట్రమ్‌ మాల్‌, పటేల్‌ గ్రూప్‌, మార్గ్‌ గ్రూప్‌, మిలాన్‌ గ్రూప్‌, గంగా ఫౌండేషన్‌ గ్రూప్‌కు చెందిన ఆఫీసులు, నివాస స్థలాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి.

కాగా.. ఇటీవల అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ బంధువుల ఇళ్లు, జయ టీవీ కార్యాలయంలో ఐటీ అధికారులు తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. ఈ సోదాల్లో రూ.1,430 కోట్ల లెక్కకు రాని సందపను గుర్తించారు. కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే దీనికి కొనసాగింపుగానే తాజా దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.