శాంతిగీతం

5

– మైత్రికి చేతులు కలిపిన మోదీ, షరీఫ్‌

– ఉగ్రవాదంపై ఉమ్మడిపోరు

మాస్కో,జులై10(జనంసాక్షి): శాంతి చిత్రం ఆవిష్క ృతమైంది.

రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌తో శుక్రవారం భేటీ అయ్యారు.  పాక్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్న లఖ్వీ వ్యవహారాన్ని భారత ప్రధాని నరేంద్రమోదీ పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ వద్ద ప్రస్తావించారు. ఉగ్రవాదాన్ని అడ్డుకుంటున్నామని షరీఫ్‌ చెప్పగా… సమగ్ర చర్యలు అవసరమని మోదీ సూచించారు. ఇరు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణానికి కృషి చేయాలని మోదీ, షరీఫ్‌ నిర్ణయించారు. రష్యా నగరం యుఫాలో ఇద్దరు నేతలు శిఖరాగ్ర చర్చలు జరిపారు. షరీఫ్‌ ఆహ్వానం మేరకు పాక్‌లో 2016లో జరిగే సార్క్‌ సదస్సుకు రానున్నట్లు మోదీ ప్రకటించారు.  2016లో సార్క్‌ సదస్సు పాకిస్తాన్‌లో జరుగుతుంది. బ్రిక్స్‌ సదస్సులో పాల్గొనేందుకు రష్యాలోని యుఫా నగరానికి వచ్చిన మోదీ ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌ ఇచ్చిన విందులో పాల్గొన్నారు. అప్పుడు మోదీ, షరీఫ్‌ పలుకరించుకున్నారు.  శుక్రవారం మోదీ, షరీఫ్‌ల భేటీ జరిగింది. విూడియా రష్యాన్‌ హ్యాండ్‌ షేక్‌ అని పిలుస్తున్న ఈ సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. అనేక ద్వైపాక్షిక అంశాల్లో పాక్‌ వైఖరిని మోదీ సూటిగానే ప్రస్తావించారు. సీమాంధ్ర ఉగ్రవాదాన్ని దాయాది దేశం పెంచి పోషిస్తోందని ఆయన అన్నారు. లఖ్వీపై పాకిస్తాన్‌లో ఉగ్రవాద స్థావరాలు లేకుండా చేస్తామని మోదీకి షరీఫ్‌ హావిూ ఇచ్చినట్లు సమాచారం. ముంబాయి పేలుళ్ల సూత్రధారులపై చర్యలకు పాకిస్తాన్‌ ప్రభుత్వం విూనమేషాలు లెక్కిస్తోందని భారత్‌ ఆరోపించింది.

పాకిస్తాన్‌ సైనికులు సరిహద్దుల్లో నిత్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నారని మోదీ గుర్తు చేశారు. గురువారం రాత్రి కూడా పాక్‌ సైనికుల కాల్పుల్లో ఒక బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ చనిపోయిన తర్వాత మృతుల వివరాలను కూడా పాక్‌కు అందించినట్లు సమాచారం. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ గుండా పాక్‌, చైనా ఆర్థిక కారిడార్‌పై మోదీ అభ్యంతరం చెప్పగా దానికి ఇంకా సమయం ఉందని షరీఫ్‌ సమాధానం ఇచ్చారు. పాక్‌ భూభాగంలో ఉగ్రవాద కార్యకలాపాలకు వెనుక భారత్‌ హస్తముందన్న షరీఫ్‌ ఆరోపణను మోదీ తోసిపుచ్చారు. సాక్ష్యాధారాలు సమర్పించాలని మోదీ డిమాండ్‌ చేశారు.