శాంతి సామరస్యాలతో కలిసి ఉండాలి:డీఐజీ

ముదిగొండ: గ్రామాల్లో ప్రజలు శాంతి సామరస్యాలతో కలిసుండాలని ఘర్షనలకు పాల్పడరాదని డీఐజీ విక్రవమ్‌సింగ్‌మాన్‌ అన్నారు. గోకినాపల్లిలో కాంగ్రెస్‌నేత కొమ్మినేని సామ్రాట్‌ మంగళవారం హత్యకు గురైన విషయం విదితమే. ఘటనస్థలిని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ సమస్యలుంటే పరిష్కరించుకోవాలని గొడవలకు దిగరాదని సూచించారు. నిందుతులకోసం 8బృందాలు గాలిస్తున్నాయని గ్రామాల్లో ప్రశాంత వాతవరణం నెకోనె వరకు పోలీసు పికెటింగ్‌ కొనసాగుదుందన్నారు.