శివసేన చర్యలను ఖండించిన అడ్వాణి
న్యూఢిల్లీ, : శివసేన కార్యకర్తలు సోమవారం ఉదయం ముంబైలో సుధీంద్ర కులకర్ణి ముఖంపై సిరా పోసిన సంఘటనను బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్కె అడ్వాణి తీవ్రస్థాయిలో ఖండించారు. ప్రతి ఒక్కరికి నిరసన తెలిపే హక్కు ఉంటుందని కానీ భౌతికంగా దాడి చేయడం సరికాదని, ఇది అప్రజాస్వామికమని ఆయన అన్నారు. పాక్ మాజీ మంత్రి ఖుర్షిద్ మహ్మద్ కసూరి రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమం ఈ సాయంత్రం ముంబైలో జరగనుంది. ఆ కార్యక్రమం నిర్వహించవద్దని డిమాండ్ చేస్తూ శివసేన కార్యకర్తలు సుధీంద్ర కులకర్ణిపై దాడి చేసి ముఖంపై నల్ల సిరా పూసారు