శివాజీ విగ్రహ ప్రతిష్టపనకు భూమిపూజ.

శివాజీ విగ్రహ ప్రతిష్టపనకు భూమిపూజ.

తాండూరు అక్టోబర్ 9(జనంసాక్షి)తాండూరు పట్టణంలోని 9వ వార్డు సాయిపూర్ వీర్ శివాజీ కాలనిలో శివాజీ విగ్రహ ప్రతిష్టపనకు వైస్ చైర్ పర్సన్ పటోళ్ల దీప నర్సింలు నాయకుల తో కలిసి భూమి పూజ నిర్వహించారు.ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పటోళ్ల దీప నర్సింలు మాట్లాడుతూ నేటి యువత శివాజీ మహారాజ్ ను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. ఆయన చూపిన మార్గంలో నడుచుకుందామని పిలుపునిచ్చారు.విగ్రహ ప్రతిష్టాపనకు స్థలం కేటాయించిన కావేరి వాటర్ ప్లాంట్ నిర్వాహకులు పట్లోళ్ల వెంకటేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, పట్లోళ్ల వెంకటేష్, మరాఠీ నర్సింలు,మహిళలు,కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.