శ్రీధర్ బాబు గెలుపొందాలని సిద్ది వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు

మంథని, (జనంసాక్షి ) : మహారాష్ట్ర లోని ముంబాయి నగరంలో ప్రసిద్ది గాంచిన శ్రీ సిద్ది వినాయక ఆలయంలో మంథని పార్టీ అభ్యర్థి దుద్దిల్ల శ్రీధర్ బాబు అఖండ విజయాన్ని పొంది ఐదో సారి గెలవాలని మంథని కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ముంబాయి లోని ప్రసిద్ధిగాంచిన హాజీ బాబా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో మంథని కాంగ్రెస్ పార్టీ నేతలు ఇనుముల సతీష్, కొండ శంకర్, బూడిద మల్లేష్, అజీమ్ ఖాన్, కిషన్ నాయక్ పాల్గొన్నారు