శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లోకి చేరికలు జనంసాక్షి, రామగిరి అక్టోబర్ 7 :

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సుందిళ్ల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, మాజీ ఎంపిటిసి, సుందిళ్ల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆలయ కమిటీ మాజీ చైర్మన్ ఊట్ల గోపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ మార్క స్వామి శనివారం మంథని ఎమ్మెల్యే, ఏఐసిసి కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిల్ల శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరితో పాటు ఊట్ల ముకుంద రెడ్డి ఊట్ల నారాయణరెడ్డి ఊట్ల రాజిరెడ్డి, మార్క శీను , వేముల సతీష్, గడ్డం తిరుపతి, గజ్జల రవి తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరికి శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మంథని ఎమ్మెల్యేగా శ్రీధర్ బాబును భారీ మెజార్టీతో గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, మాజీ సర్పంచ్ నడిపెల్లి రామ్మోహన్ రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు జనగామ బుచ్చిబాబు, తోట చంద్రయ్య మహేష్ రావు, వైనాల రాజు, ముస్కుల నరేందర్ రెడ్డి, రేకుంట్ల రవి, మాటూరి లక్ష్మణ్, చెరుకు నారాయణ, గడ్డం సంతు, గడ్డం సమ్మయ్య, కోరుకొప్పుల మణికంఠ, తీగల సమ్మయ్య, దాసరి గట్టయ్య, ముత్యాల శ్రీనివాస్, కాటం సత్యం, బొజ్జ సతీష్ తదితరులు పాల్గొన్నారు.