శ్రీయ కుటుంబసభ్యులను పరామర్శించిన భాజపా నేత

మెట్టుగడ్డ, మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: పాలమూరులో ఇటీవల హత్యకుగురైన చిన్నారి శ్రీయ కుటుంబసభ్యులను భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు పరామర్శించారు. జిల్లా కేంద్రంలో ఉన్న బాలసదన్‌కు శ్రీయ పేరు పెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ సంఘటనపై త్వరితగతిన విచారణ చేపట్టి దీషులను కఠినంగా శిక్షించాలని కోరారు.