శ్రీశౌలంలో వైభవంగా ఆరుద్రోత్సవం

శ్రీశైలం,డిసెంబర్‌20( జనం సాక్షి ): ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో శ్రీ మల్లికార్జున స్వామివారి వార్షిక ఆరుద్రోత్సవం వైభవంగా జరుగుతున్నది. వేదపండితులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు ఉత్తరద్వారం ద్వారం ద్వార భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి అమ్మవార్లకు నంది వాహనంపై ఆలయ మాడవీధుల్లో గ్రామోత్సవం నిర్వహిస్తున్నారు. వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ నెలకొన్నది. సోమవారం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేకువజాము నుంచే స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో వేచిఉన్నారు. దీంతో రాజన్న దర్శనానికి మూడు గంటల సమయం పడుతున్నది. రాజన్న ఆలయంలో మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తున్నారు.