శ్రీ చైతన్య  విద్యార్థులకు…  ఎల్ఐసి ప్రోత్సాహకం ..

(జనం సాక్షి/  వైరా )
వైరాలోని శ్రీ చైతన్య డిగ్రీకళాశాల కు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థిని విద్యార్థులకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వారు గురువారం ప్రోత్సాహక బహుమతులు అందించారు ..ఎల్ఐసి సంస్థ స్థాపించి 63 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కళాశాలల్లో విభాగాలకు సంబంధించి ఇటీవల ప్రకటించిన యూనివర్సిటీ మార్కులు ఆధారంగా అత్యధిక పర్సంటేజ్ సాధించిన విద్యార్థులకు సంస్థ వారు ప్రశంస పత్రంతో పాటు జ్ఞాపికను అందించారు .
అనంతరం ఎల్ఐసీ సంస్థ ప్రతినిధులను డిగ్రీ కళాశాల నిర్వాహకులు సత్కరించి కళాశాల జ్ఞాపికను అందజేశారు .
ఈ కార్యక్రమంలో  డాక్టర్ దారెళ్లి కోటయ్య , కళాశాల కరస్పాండెంట్ చింతల కిరణ్ శౌరీ ,ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చింతల వెంకన్న ,మధిర ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ ఎం ఎస్ ఎన్ ఆర్ రమణ ,అసిస్టెంట్ బ్రాంచ్  మేనేజర్ రాఘవేంద్రరావు,వైరా నియోజకవర్గ పరిధి ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు