సంగీత సామ్రాజ్ఞి అన్నపూర్ణాదేవి కన్నుమూత
ముంబై,అక్టోబర్13(జనంసాక్షి): ప్రఖ్యాత సంగీత విద్వాంసురాలు అన్నపూర్ణ దేవి(91) ఇక లేరు. గత కొన్నేళ్ల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయిన అన్నపూర్ణ దేవీ.. తన పేరిట సంగీత కళాశాల ఏర్పాటు చేసి ఎంతోమందిని సంగీతంలో తీర్చిదిద్దారు. మధ్యప్రదేశ్ లోని విూహార్ టౌన్లో ఉస్తాద్ బాబా అల్లుద్దీన్ ఖాన్, మదీనా బేగం దంపతులకు అన్నపూర్ణ దేవీ జన్మించారు. సితార విద్వాంసులు రవిశంకర్ను అన్నపూర్ణ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు. అయితే రవిశంకర్ 1992లో మరణించడంతో.. ఆ తర్వాత రుషికపూర్ పాండ్యాను వివాహమాడింది. పాండ్యా 2013లో కన్నుమూశారు. అన్నపూర్ణ దేవి మృతిపట్ల పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంతాపం ప్రకటించారు. అన్నపూర్ణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.