సంగ్మా మృతి పట్ల లోక్‌సభ సంతాపం

లోక్‌ సభ మాజీ స్పీకర్ పి.ఎ. సంగ్మా మృతి పట్ల లోక్ సభ సంతాపం తెలిపింది. సభ ప్రారంభం కాగానే సంగ్మా మృతి చెందిన విషయాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ సభకు తెలియజేశారు. ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్పీకర్ ప్రస్తావించారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి సంగ్మా తీవ్రంగా కృషి చేశారని కొనియాడారు. స్పీకర్ గా అన్ని పార్టీల అభిమానాన్ని సొంతం చేసుకున్నారని చెప్పారు. సంతాపం అనంతరం సభను స్పీకర్ మంగళవారానికి వాయిదా వేశారు.