సంచలన వ్యాఖ్యాలు చేసిన సినీ నటి అంజలి

చైన్నై, జనంసాక్షి: వెండి తెరపై వెలుగుతున్న సినీ నటి అంజలికి తన పిన్ని భారతీదేవి విలన్‌గా మారింది. సినీ నటి అంజలి చైన్నైలో ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పిన్ని కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణహాని ఉన్నదని ఆరోపించారు. తనకు పిన్ని ఏటీఎంలా వాడుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళ దర్శకుడు కలంజియంతో కలిసి పిన్ని తన ఆస్తిని దోచుకున్నదని ఆరోపించారు. ఖర్చులకు తన వద్ద డబ్బులు కూడా లేవని తెలిపారు.