సబ్సిడీ ఇవ్వలేదని నిరసిస్తూ అధికారులను నిర్భందించిన రైతులు

చిన్నచింతకుంట, జనంసాక్షి: ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వలేదని నిరసిస్తూ రైతులు దమద్‌నాపూర్‌లో అధికారులను నిర్భందించారు. రైతుచైతన్య యాత్రకు వచ్చిన వ్యవసాయాధికారులు సమావేశం నిర్వహిస్తుండగా తమకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కోసం ఎన్నిసార్లు విన్నవించినా ఇవ్వడం లేదని వారిని గ్రామపంచాయతీ భవనంలో నిర్భందించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.