సమత కళాశాలలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

సమత కళాశాలలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

తొర్రూర్ అక్టోబర్ 13 (జనం సాక్షి)
పట్టణ కేంద్రానికి చెందిన సమతా డిగ్రీ పీజీ కళాశాలలో బతుకమ్మ ముందస్తు సంబరాలు అంబరాన్నంటాయి.ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ కోటా రఘునాధ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించి,వాటిని ఆచరించి అంతరించిపోకుండా ముందు తరాలకు అందివ్వాలని ఆయన సూచించారు.కాగా అంతకుముందు విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి సమావేశానంతరం భక్తి ప్రపత్తులతో పాటలు పాడి,ఆటలు ఆడి బతుకమ్మ ఔన్నత్యాన్ని చాటి చెప్పారు.కార్యక్రమంలో సమతా విద్యాసంస్థల డైరెక్టర్లు రామ్ రెడ్డి, నరసింహారెడ్డి ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్ వెంకన్న, చంద్రబాను,నవీన్ రెడ్డి, రవీందర్,ఆధ్యాపక బృందం,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు