సమైక్యత వజ్రోత్సవం లో విరివిగా పాల్గొనాలి
– తెరాస పార్టీ మండల అధ్యక్షులు బండి పుల్లారావు
అశ్వరావుపేట సెప్టెంబర్ 13( జనం సాక్షి )
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం సమైక్యత వస్త్రోత్సవ ప్రారంభ దినం జరుపుకోవడానికి మండలంలోని ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అధికారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెరాస పార్టీ అశ్వరావుపేట మండల అధ్యక్షులు బండి పుల్లారావు తెలిపారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా ప్రతినిధులు కార్యకర్తలకు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. 16వ తేదీ నుండి మూడు రోజులు పాటు ఈ కార్యక్రమాలు జరుగుతాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి, తెరాస పార్టీ మండల కార్యదర్శి జుజ్జూరు, వెంకన్న బాబు. టిసిసిబి డైరెక్టర్ నిర్మల పుల్లారావు, మండల తెరాస నాయకులు రాజమోహన్ రెడ్డి, కల్పాల శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.