సరి-బేసి పద్ధతిలో జోక్యం చేసుకోం: దిల్లీ హైకోర్టు

1న్యూఢిల్లీ: ఢిల్లీ రహదారులపైకి సరి-భేసి విధానంతో మాత్రమే వాహనాలకు అనుమతిస్తామని ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ లో తాము జోక్యం చేసుకోబోమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం పేర్కొన్నట్లుగా ఈ నెల 15వరకు(శుక్రవారం) ఆ నోటిఫికేషన్ ప్రకారమే అమలవుతుందని, దానిని మధ్యలో ఆపలేమని చెప్పింది.

దీనిపై తుది తీర్పును మాత్రం నేరుగా వెల్లడించకుండా శుక్రవారానికి వాయిదా వేసింది. అయితే, ఫిబ్రవరి 15 నుంచి ప్రవేశ పెట్టనున్న కొత్త ట్రాఫిక్ నిబంధనలను వ్యతిరేకిస్తూ కోర్టుకు వచ్చిన నోటీసులపై మాత్రం విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది.