సర్వే నెంబర్ 205,206 ల లో నాలుగు ఎకరాల 20 గుంటల భూమి కబ్జా

యాచారం మండల పరిధిలోని కొత్త పల్లి గ్రామ రెవెన్యూ పరిధి లోని సర్వే నంబర్  205, 206లో పట్టా భూములు ఉన్నాయని చెప్పారు. తమకు సర్వేనెంబర్ 204కు ఎలాంటి సంబంధం లేదని , గ్రామానికి చెందిన రైతు కల్లు వేణుగోపాల్ రెడ్డి అన్నారు . సర్వే నెంబర్ 205,206 ల లో మొత్తం 19 ఎకరాల ఆరు గంటల వ్యవసాయ భూమి కలదని  ఈ సర్వే నెంబర్లలో ఉన్న 4 ఎకరాల 20 గుంటల భూమిని అలువెల్లి శ్రీనివాస్ రెడ్డి, మిట్టవాయి కొండల్ రెడ్డి, వంగ జంగారెడ్డి, వంగ నరేందర్ రెడ్డి, నలుగురు వ్యక్తులు కబ్జా చేస్తున్నారని  వీరికి సర్వే నంబర్ 204 లో భూమి కలదు 205, 206 లలో ఉన్న భూమిని వీరు కబ్జా చేస్తున్నారని  ఆదివారం వీరు డ్రోజర్ సహాయంతో భూమిని చదును చేసే ప్రయత్నం చేశారని అన్నారు వారికి 204 సర్వే నంబర్ లో భూమి ఉందని 204 సర్వే నంబర్ తో తమకు సంబంధం లేదని అయినా కూడా తమపై తప్పుడు కేసులు పెట్టి గ్రామం లోని కొంత మంది పెద్ద మనుషుల సహకారం తో తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఇట్టి భూమి విషయం లో కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఇచ్చిందని కోర్టు లో కేసు నడుస్తోండగా భూమిని ఎలా చదును చేస్తారని అన్నారు వీరిపై తగు చర్యలు తీసుకోవాలని యాచారం పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసినట్లు వేణుగోపాల్ రెడ్డి తెలిపారు