సామాన్యులను బికారులుగా మార్చేశారు

ప్రధాని నరేంద్ర rahul-gandhi-pti_650x400_71455107821మోడీ పెద్ద నోట్లను రద్దు చేయడం ద్వారా సామాన్యులను బికారులుగా మార్చేశారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. మంగళవారం ఇక్కడ మాట్లాడిన ఆయన నల్లధనం అరికట్టేందుకు అంటూ కేంద్రం ఎవరితోనూ సంప్రదించకుండా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించారు. నిర్ణయంతో దేశ ప్రజలు నగదు లేకుండా చేశారని దుయ్యబట్టారు. కార్పొరేట్లు, బడాబాబులు బ్యాంకులలోని డబ్బును దొడ్డిదారిన డ్రాచేకుకుంటున్నారని రాహుల్ విమర్శించారు. నగదు రహిత ఆర్ధిక వ్యవస్థ ను లక్ష్యంగా చేసుకుని పెద్ద నోట్లను రద్దు చేసిన మోడీ దేశ ప్రజలను నిజంగా నగదు లేనివారిగా మార్చేశారని అన్నారు.