సామాన్య భక్తులకు మరింత వెసలుబాటు

వారాంతంలో విఐపి బ్రేక్‌ దర్శనాలు రద్దు
తిరుమల,ఫిబ్రవరి25( జనం సాక్షి): తిరుమల తిరుపత దేవస్థానం సామాన్య భక్తులకు శుభవార్త చెప్పింది. సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనంలో ప్రాధాన్యత ఇచ్చేలా వికేండ్‌లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. సర్వదర్శనం భక్తులుకు ప్రాధాన్యత ఇచ్చేందుకు శుక్ర, శని, ఆదివారలలో సిఫార్సు లేఖలపై కేటాయించే వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. వీఐపీల కోసం కేటాయించిన సమయాన్ని కూడా సామాన్య భక్తులకు కేటాయించేలా టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఇక, శుక్ర, శని, ఆదివారలలో సర్వదర్శనం భక్తులు సౌకర్యార్థం అదనంగా దర్శన టోకేన్లు జారీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.. ఇప్పటికే రోజుకు సర్వదర్శనం భక్తులకు 30 వేల టోకేన్లు టీటీడీ జారీ చేస్తోన్న విషయం తెలిసింది.. టీటీడీ తాజా నిర్ణయంతో సర్వదర్శన భక్తులకు రోజుకు అదనంగా మరో రెండు గంటల దర్శన సమయం పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు.